కథ
భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ మహర్ కుటుంబంలో పుట్టారు; ఆ కులాన్ని అప్పట్లో అంటరానిదిగా లెక్కించేవారు. బడిలో ఆయన్ని తరగతికి దూరంగా కూర్చోబెట్టేవారు, నీళ్ళ కుళాయిని ముట్టుకోనిచ్చేవారు కాదు. ఆయనే తర్వాత కొలంబియాలోనూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ డాక్టరేట్లు తీసుకుని, గ్రేస్ ఇన్లో బారిస్టర్ అయ్యారు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఆయన అధ్యక్షుడు. ఆ రాజ్యాంగం పదిహేడో అధికరణంలో అంటరానితనాన్ని రద్దు చేసింది. మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారు. ఆస్తిలోనూ విడాకుల్లోనూ స్త్రీలకు హక్కులిచ్చే హిందూ కోడ్ బిల్లు ఆగిపోయినప్పుడు పదవి వదిలేశారు.
1956 అక్టోబర్లో, చనిపోవడానికి కొన్ని వారాల ముందు, నాగపూర్లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధం స్వీకరించారు. ఇరవై ఏళ్ళ ముందే ఆయన అన్నారు — హిందువుగా పుట్టాను, హిందువుగా చనిపోను అని.
